జీడిమెట్ల, వెలుగు: ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం లంచం తీసుకుంటూ హైదరాబాద్ సిటీలోని కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆఫీస్లో పని చేసే జూనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కాడు. సిటీ రేంజ్ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ జి. గణేశ్ ఇన్చార్జి గ్రామ పరిపాలన అధికారిగా పని చేస్తున్నాడు. ఓ వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, గణేశ్ రూ.30 వేలు డిమాండ్ చేయగా, తగ్గించమని కోరడంతో రూ.20 వేలకు ఒప్పందం చేసుకున్నాడు.
రెండు రోజుల కింద రూ.5 వేలు అందజేసి, ఆ తర్వాత ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సోమవారం గణేశ్కు బాధితుడు రూ.15వేలు లంచం ఇవ్వగా, ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
